తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల పేరుతో అధిక వసూళ్లు, అదనపు చార్జీలు, నిబంధనల ఉల్లంఘనలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలపై తల్లిదండ్రులు ఇక ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్సైట్లోని ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలో ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు తర్వాత ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకోవచ్చు.