తెలంగాణలో వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.