Andhra Pradesh Rain Updates: ఏపీపై ద్రోణి ప్రభావం కనిపిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులకు అవకాశం ఉంటుందని.. ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతుందన్నారు. ఇవాళ ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.