బస్సు బోల్తా పడిన ఘటనలో.. నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి దివ్యాంగురాలైన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదంలో యువతి చేయి విరిగిపోగా.. ఆమెను చేయి లేకుండానే ఆస్పత్రికి తరలించారు. 2 గంటల్లో చేతిని తీసుకువస్తే.. అతికిస్తామని డాక్టర్లు చెప్పగా.. సకాలంలో తీసుకురాలేకపోయారు. దీంతో ఆ యువతి జీవితాంతం ఒంటి చేయితోనే బతకాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆధారమైన ఆ యువతికి ఇలా జరగడంతో ఆ ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.