తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. డిసెంబర్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో 6-9 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.