తెలంగాణలో 2025-28 బ్లాక్ పీరియడ్కు సంబంధించి ఇంజినీరింగ్ ఫీజులపై ప్రభుత్వం బిగ్ రిలీప్ ఇచ్చింది. టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదించిన భారీ పెంపును కాదని.. ర్యాంకింగ్, మౌలిక వసతుల వంటి శాస్త్రీయ కొలమానాలతో ఫీజులను పునఃసమీక్షించింది. ఫలితంగా రాష్ట్రంలోని అత్యధిక కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగనుండగా.. కొన్నింటిలో మాత్రం ఫీజులు తగ్గనున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక జీవో విడుదల కానుంది.