తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ వేయడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక ఊరట అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ కేసు వల్ల రిజర్వేషన్ల ప్రక్రియలో జాప్యం జరగవచ్చని భావించారు. ఇప్పుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ముందడుగు వేసే అవకాశం ఉంది.