జగిత్యాల జిల్లాలో ఇన్స్టా రీల్స్ కోసం ఓ యువకుడి పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు. బుర్ఖా వేసుకొని కోరుట్ల బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. ఆర్టీసీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బుర్ఖా ఎందుకు వేసుకున్నావని సిబ్బంది ప్రశ్నించగా.. రీల్స్ కోసం అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు.