తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్నందున.. రేపు (డిసెంబర్ 9) సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా మండలాల్లోని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. అలాగే.. డిసెంబర్ 14, 17 తేదీల్లో జరిగే ఎన్నికలకూ ఇదే తరహాలో మూడు విడతల్లో మద్యం నిషేధం అమలవుతుంది. అధికారులు ఆదేశాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.