Madanapalle Girl Murder Case Accused Died In Pond: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని కురబాలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో గుర్తించారు. ముదివేడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కులవర్ధన్ నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు.. చివరికి శవమై తేలాడు.