తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడులో చిలకా సాయితేజ అనే ఓ భక్తుడు శివుడి మీద తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. నాణేలతో శివలింగాన్ని తయారుచేశారు. రూ. లక్షా 30 వేల నాణేలను ఉపయోగించి సుమారుగా రెండు నెలల పాటు శ్రమించి ధన శివలింగం తయారు చేశారు. ఈ శివలింగాన్ని మహాశివరాత్రి సందర్బంగా పట్టిసీమలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించనున్నారు.