విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళ మెడలో, ఇప్పటికే పెళ్లై పిల్లలున్న వ్యక్తి బలవంతంగా తాళి కట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. మద్యం మత్తులో మహిళ ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు కావాలనే చేశాడా.. లేదంటే మద్యం మత్తులో ఇలాంటి పని చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు.