రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. శుక్రవారం రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి రాంబాబు.. జరిగిన పరిణామాలను జగన్కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కమ్మ వారిని తిట్టానంటున్నారని.. కానీ తన కుటుంబంలో ఉండే ఎనిమిది మందిలో సగం వాళ్లేనన్నారు. తన ఇద్దరు అల్లుళ్లు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనని..అలాంటిది తానెందుకు తిడతానంటూ ప్రశ్నించారు.