మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ పునర్విభజనపై మాట్లాడిన తలసాని.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తలసాని తన వ్యాఖ్యలను ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు.