గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సరదాగా స్పందించారు. పందేలకు ఆహ్వానించినా.. వెళ్లనని కోడి పందేల పంతాయితీ తనకెందుకని చమత్కరించారు. మీడియా ప్రశ్నల భయంతోనే దూరంగా ఉంటున్నానని.. హైదరాబాద్లో పతంగి ఎగరేసుకోవడమే తనకు ఇష్టమని తెలిపారు.