సరస్వతీ పుష్కరాలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పుష్కరాల నిర్వహణ ఒక సవాలుగా స్వీకరించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసిన యంత్రాంగాన్ని అభినందించారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, ఇది ఒక రికార్డు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఇది ఒక ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.