మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గత ఐదు రోజులుగా హుండీల లెక్కింపు చేపడుతున్నారు. అయితే మేడారం హుండీలో కాసులపేరు బయటపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ దాన్ని పరీక్షించి చూడగా.. అది నిజమైన బంగారు కాసులపేరు కాదని తేలింది. గిల్టు నగలను భక్తులు మేడారం హుండీలో వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.