గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో భవనం, ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు, నగదు, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. ఈ కేసులో డ్రైవర్ ద్వారా ఇసుక రవాణాదారులు, మైనింగ్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి.. బొజ్జ జయరాజు కుమార్తె అకౌంట్కు బదిలీ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.