యాదగిరిగుట్టతో పాటు తెలంగాణలోని మరో ప్రాంతాల్లో రోప్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వ 'పర్వతమాల పరియోజన' కింద ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ చేపట్టనుంది. దీని ద్వారా పర్యాటక ప్రాంతాలకు భక్తులు సులభంగా చేరుకోవచ్చు. ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. దేశవ్యాప్తంగా 200 రోప్వేలను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.