రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ‘రా అంటే.. పార్టీలోకి వెళ్తాను’

1 year ago 19
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా బీజేపీ ఎమ్మెల్యేనేనని, గోషామహల్‌కు మూడేళ్ల వరకు ఎన్నికలు రావని స్పష్టం చేశారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ తనకు సొంతిల్లు లాంటిదని, అధిష్టానం పిలిస్తే వెంటనే తిరిగి వెళ్తానని రాజా సింగ్ అన్నారు. తనపై కొందరు పార్టీ నేతలే ఢిల్లీకి ఫిర్యాదు చేశారని ఆయన ఆరోపించారు. త్వరలోనే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..
Read Entire Article