రాత్రి పబ్‌లో పార్టీ.. తెల్లారేసరికి సాఫ్ట్‌వేర్ మృతి.. కారణం ఏంటి..?

9 months ago 27
కొండాపూర్‌లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్న విజయనగరం జిల్లాకు చెందిన హర్షవర్ధన్ (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సికింద్రాబాద్‌లోని ఓ ఏసీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్, తన స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి ఆదివారం రాత్రి కొండాపూర్ క్వాక్ పబ్‌లో పార్టీ చేసుకున్నాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని తమ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న తర్వాత, స్నేహితులతో కలిసి మరోసారి మద్యం సేవించాడు. తెల్లవారుజామున హర్షవర్ధన్‌కు వాంతులు కావడంతో, స్నేహితులు అతడిని వెంటనే ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article