AP Automatic Mode Registration Mode: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అర్బన్ ఆటో-మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్' పథకంతో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆస్తి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో అప్డేట్ అవుతాయి. దీనివల్ల అవినీతి తగ్గి, పౌరులకు సమయం ఆదా అవుతోంది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 23 వేల ఆస్తుల మ్యుటేషన్లు పూర్తయ్యాయి, ప్రభుత్వానికి రూ.8 కోట్ల ఆదాయం వచ్చిందిని అధికారులు తెలిపారు.