ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఇకపై కూలీలందరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వర్తింపజేయనుంది. ప్రమాదవశాత్తు కూలీలకు ఏదైనా జరిగితే రూ. 2 లక్షల బీమా లభిస్తుంది. ఏడాదికి కేవలం రూ. 20 చెల్లిస్తే చాలు. ఈ పథకం ద్వారా కూలీల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.