రేవంత్ రెడ్డి కేబినెట్‌లోకి రాములమ్మ.. కొండా సురేఖ స్థానంలో విజయశాంతి.. ఢిల్లీకి పయనం!

1 hour ago 1
కొండా సురేఖను కేబినెట్‌ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో మంత్రివర్గంలో మరో మహిళా నేతకు అవకాశం కల్పించే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఆ స్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మంత్రి పదవిపై హైకమాండ్‌తో విజయశాంతి చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారని.. ఢిల్లీకి పయనం అయ్యేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె హోంశాఖను కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Entire Article