తెలంగాణలో నిజాం కాలం నాటి భూముల సమస్యలకు పరిష్కారం లభించనుంది. 413 గ్రామాల్లో భూ సమస్యలు ఉండగా..ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టి, ఆధునిక సాంకేతికతతో సర్వే చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అందుకు మహబూబ్నగర్, జగిత్యాల, ఖమ్మం, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లోని ఐదు గ్రామాలను ఎంపిక చేశారు. ఈ సర్వేతో భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.