గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల పెట్టుబడి సహాయం అందించిందని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. తెలంగాణ రైతులు ఆయిల్ పామ్, వరి ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.