ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నెల్లూరు టీడీపీ నాయకుడు జాకీర్ మృతి చెందారు. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. జాకీర్ మృతి పట్ల మంత్రి నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్లోనూ పీసీపల్లి మండల టీడీపీ నేత వీరపనేని కేశవులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.