తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో 28న ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన గిన్నిస్ రికార్డు స్థాయి వేడుక వర్షాల కారణంగా 29న సరూర్నగర్ స్టేడియానికి మార్చారు. 26వ తేదీన అంబర్పేట్ బతుకమ్మకుంటలో జరిగే సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన సన్నాహాలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.