తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లో ఉన్నప్పటికీ వారసత్వ భూములపై పట్టాలు జారీ ప్రక్రియ సమస్యల్లో కూరుకుపోయింది. పట్టా పాస్ బుక్ చేయించుకోవడానికి తగిన పత్రాలు లేకపోవడం, కుటుంబ కలహాలు, సంతకాల వివాదాలు పెండింగ్ కేసులకు కారణమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 6,106 దరఖాస్తులు అందగా 4,047 ఇంకా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ఆడపిల్లల హక్కుల విషయంలో సోదరులు–చెల్లెళ్ల మధ్య తగాదాలు పెరుగుతున్నాయి. మరణ ధ్రువీకరణ లేకపోవడం కూడా ప్రధాన ఆటంకంగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.