ఏపీ ప్రభుత్వం గిరిజన రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే గిరిజన రైతులను గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం కోసం ప్రోత్సహిస్తున్నారు. వీటి పెంపకం కోసం నిధులు మంజూరు చేస్తోంది. ఈ విషయాన్ని అల్లూరి జిల్లా వై. రామవరం ఎంపీడీవో బాపన్న దొర వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు పది శాతం వాటా రుణం చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఇప్పటి వరకూ మండలంలో 3870 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు వివరించారు.