తెలంగాణ రైతులకి భరోసాగా రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు సాయం అందుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నిరుపేదలకి కూడా ఆర్ధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం గిరిజనులని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకి ఇల్లు కట్టిస్తామని తెలిపారు.