కలెక్టర్ కావాలనుకున్న డాక్టర్ సీతయ్య అనే వ్యక్తి సివిల్స్లో ఫెయిల్ కావడంతో నిరాశకు గురయ్యాడు. ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై.. చివరకు ఆ డబ్బుల కోసం సైబర్ నేరగాడిగా మారాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేశాడు. పుణే యూనివర్సిటీకి నిధులు ఇస్తానని నమ్మించి రూ.2.46 కోట్లు కాజేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..