Visakhapatnam Cognizant: విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది. ఈక్రమంలో కాగ్నిజెంట్ సంస్థ జనవరి 26 నుంచి 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కాపులుప్పాడలో భారీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో 25,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో విశాఖ ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. మరి కొన్ని కంపెనీలు కూడా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే విశాఖలో కార్యకలపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయి.