ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోవడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అవసరాన్ని కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు. కట్టెల పొయ్యిలపై నీటిని కాచి, ఒక్కో బకెట్ వేడి నీళ్లను 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. గతంలో కుంభమేళాలో జరిగిన వ్యాపారాల తరహాలోనే ఇక్కడ కూడా వేడి నీళ్ల అమ్మకాలతో వేలల్లో సంపాదిస్తున్నారు.