మాజీ సీఎం వైఎస్ జగన్కు.. సీబీఐ కోర్టు ఒకేసారి ఒక గుడ్న్యూస్, మరో బ్యాడ్న్యూస్ చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు గతేడాది పెట్టుకున్న పిటిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అయింది. అయితే అదే సమయంలో ఒక బ్యాడ్న్యూస్ను కూడా కోర్టు చెప్పింది. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత.. కోర్టులో ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా ఏళ్ల తర్వాత.. వైఎస్ జగన్ ప్రత్యక్ష విచారణకు సీబీఐ కోర్టుకు రావాల్సి ఉంది.