మాజీ సీఎం వైఎస్ జగన్కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓ సలహా ఇచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. వైఎస్ జగన్కు వీలైతే అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోరాటం చేసిందని.. గుర్తు చేశారు.