వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన కేసుల వివరాలను సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. తనపై 17 కేసులు పెట్టారని వివరించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై అత్యధికంగా 66 కేసులు పెట్టారని.. 45 సార్లు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాను ఏ తప్పూ చేయనని.. అయితే ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని తేల్చి చెప్పారు.