యూట్యూబర్ నందనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. విదేశీ ఉద్యోగాలు, వీసా సేవల పేరుతో సుమారు 100 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలపై ఆమె, భర్త మధుకర్పై కేసు నమోదైనట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ కావడంతో ఎయిర్పోర్టులో ఆమెను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది.