తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఉద్యోగులకు రూ. 1.25 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. సింగరేణి సంస్థ స్ఫూర్తితో ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.