వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా పునరుజ్జీవన వేడుక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు.