శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల వాయిదా పడింది. అయితే ఇది కేవలం మూడు రోజులకు సంబంధించి మాత్రమే. డిసెంబర్ నెలకు సంబంధించి 29,30,31వ తేదీల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ల విడుదలను పరిపాలన కారణాలతో వాయిదా వేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది . సవరించిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.