సంక్రాంతి ఎఫెక్ట్.. మటన్ కేజీ రూ.800.. నాటు కోడి కేజీ ధర రూ.2,500..

3 months ago 11
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేళ నాటుకోడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ రోజుల్లో నాటుకోడి మాంసం వండుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో వీటికి భారీ గిరాకీ ఏర్పడింది. ఏపీకి ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. ఏపీలోని గోదావరి జిల్లాల్లో నాటుకోడి ధర రికార్డు స్థాయిలో రూ. 2 వేల నుండి రూ. 2,500 వరకు పలుకుతున్నాయి. మటన్ ధర రూ. 800 ఉండగా.. నాటుకోడి ధర దాన్ని మించిపోవడం గమనార్హం. ఉత్పత్తి తగ్గడం, పెంపకం చేసే రైతుల సంఖ్య పరిమితంగా ఉండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
Read Entire Article