గోదావరి జిల్లాల అతిథి మర్యాదలను తలపిస్తూ.. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ అత్తమామలు కొత్త అల్లుడికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. అల్లుడిని సంక్రాంతికి ఇంటికి ఆహ్వానించిన అత్తామామలు.. 158 రకాల పిండి వంటలతో మహారాజ ట్రీట్ ఇచ్చారు. సంప్రదాయ పిండివంటకాలతో పాటు రకాల స్వీట్లు, పచ్చళ్లు కూడా వడ్డించారు. కాగా, అత్తమామలు ఏర్పాటు చేసిన విందుపై కొత్త అల్లుడు సంతోషం వ్యక్తం చేశాడు. అయితే గతేడాది ఏలూరు జిల్లాలో 450కు పైగా వంటకాలతో అల్లుడిని ఆశ్చర్యపరిచారు ఓ దంపతులు.