సరోగసీ పేరుతో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన ‘సృష్టి’ ఫర్టిలిటీ సెంటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 381 ఫర్టిలిటీ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల కోసం 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఇతర సెంటర్లపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.