పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఓవర్ డోస్ కారణంగా సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాలు నొప్పితో బాధపడుతున్న కనకయ్య అనే వ్యక్తి అతిగా మాత్రలు వేసుకోవటం వల్ల చనిపోయాడు. ఈ ఘటనతో కనకయ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు వేసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.