సైబర్ నేరగాళ్లు చదువుకున్న వారిని సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ఒక మాజీ ఐఏఎస్ అధికారి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 3.37 కోట్లు పోగొట్టుకున్నారు. ట్రేడింగ్ యాప్ లింక్ ద్వారా పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాడు, అధికారికి నమ్మకం కలిగించి భారీగా డబ్బులు కాజేశాడు. పలు విడతలుగా మొత్తం 3.37 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు..