ఏపీలో కలరా కేసుల కలకలం రేగింది. గుంటూరు జిల్లాలో కలరా కేసులు నమోదు కావటం కలవరపెట్టింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లాలో మూడు కలరా కేసులు నమోదైనట్లు తెలిసింది. మరోవైపు అప్రమత్తమైన అధికారులు కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను, పారిశుద్ధ్య నిర్వహణపైనా దృష్టి సారించారు. మరోవైపు మంగళవారం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీమ్ అన్సారియా నగరంలో పర్యటించారు. కలరా, డయేరియా నేపథ్యంలో గుంటూరులో పానీపూరీ బండ్లను మూసివేయించినట్లు తెలిపారు.