హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో మరణించిన వారికి గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలికేందుకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. గచ్చిబౌలి, తెల్లాపూర్, కూకట్పల్లి, మియాపూర్, నల్లగండ్ల ప్రాంతాల నివాసితులు ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కొత్త హై రైజ్ భవనాలు, భారీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఇలాంటి స్థలాన్ని తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనను కొత్త భవన నిబంధనల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు MAUD అధికారులు తెలిపారు. డెవలపర్లు కూడా ఫ్రీజర్ బాక్సులతో పాటు ప్రత్యేక సంతాప ప్రదేశాలు ఏర్పాటు చేయాలని నివాసితులు సూచిస్తున్నారు.