తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారి 44పై వాహనాల రద్దీ పెరగడం, టైగర్ రిజర్వ్ ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రహదారి ఆర్ఆర్ఆర్ నుండి మంచిర్యాల వరకు ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.