హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44పై ప్రమాదకర ప్రదేశాలపై NHAI దృష్టి సారించింది. రంగారెడ్డి నుంచి గద్వాల వరకు 33 బ్లాక్స్పాట్లు గుర్తించారు. ఏటా 220 మంది మరణిస్తుండగా, ప్రమాదాల నివారణకు మూడు చోట్ల ఆరు వరుసల అండర్పాస్లు నిర్మించనున్నారు. రూ.78.54 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. దీంతో ప్రయాణం సురక్షితం కానుంది.